- Advertisement -
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాస్ కాలనీకి చెందిన సింగరేణి ఎస్ ఎన్ పిసి కార్మికుడు నెరుపటి మొగిలి గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం భూపాలపల్లి సింగరేణి ఎస్ ఎన్ పి సి డిపార్ట్మెంట్ కార్మికులు మొగిలి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం 83 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలోసెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ రావు, సీనియర్ ఇన్స్పెక్టర్ జంగా లక్ష్మీరాజ్యం, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -