ముంబయి : స్వదేశీ ఎఐ ఆధారిత స్మార్ట్ హెమోడయాలసిస్ మెషీన్ను విడుదల చేసినట్లు రెనాలిక్స్ ప్రకటించింది. దీన్ని విస్తృత స్థాయిలో తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వచ్చే నాలుగేళ్లలో రూ.800 కోట్లు పెట్టుబడుల వ్యయం చేయనున్నట్లు రెనాలిక్స్ హెల్త్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు శ్యామ్ వాసుదేవరావు తెలిపారు. పూర్తి స్వదేశీ, ఎఐ, క్లౌడ్-ఆధారిత ఆర్ఎక్స్టి21 స్మార్ట్ హెమోడయాలసిస్ మెషీన్ ప్రారంభ ధర రూ.6.70 లక్షలుగా నిర్ణయించామన్నారు. దిగుమతి చేసుకున్న యంత్రాల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుందన్నారు. ఇది ముఖ్యంగా కార్డియోవాస్కులర్, పల్మనరీ, తీవ్రమైన మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన సంరక్షణను అందిస్తుందన్నారు.