Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతీన్మార్ మల్లన్న పార్టీపై ఎస్ఈసీకి హైకోర్టు...

తీన్మార్ మల్లన్న పార్టీపై ఎస్ఈసీకి హైకోర్టు…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన పార్టీ గుర్తింపు, గుర్తుకు సంబంధించిన అభ్యర్థనను పరిశీలించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న మల్లన్నకు ఊరట లభించినట్లయింది.

ఇటీవల తాను స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపునిచ్చి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తును కేటాయించాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకుని, నిబంధనల మేరకు తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -