నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూలు కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్.వి యువజన విభాగం పట్టణ అధ్యక్షులు పెంట నితీష్, మండల అధ్యక్షులు ముల్లె నాగేంద్రబాబు లు మాట్లాడారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నాగారం సూరజ్, బి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు కంకల మహేష్, నాయకులు ఇండ్ల శ్రీను,యాస సంతోష్ రెడ్డి, మోత్కుపల్లి అజయ్,రొయ్యల పవన్,తుమ్మల వినోద్,భూషపక మనీష్,అరిగే విక్రాంత్,సురేష్ ముదిరాజ్,ఉదయగిరి ఆకాష్,రసాల లింగస్వామి,సుమన్, వేణు లు పాల్గొన్నారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూలు, కళాశాలపై చర్యలు తీసుకోవాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES