నవతెలంగాణ హైదరాబాద్: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ శనివారం వెల్లడించింది.
ఈ కమిటీ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అంచనా వేయనుంది. అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కూడా తనిఖీ చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే, ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని.. ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.