జిల్లా వ్యవసాయ అధికారి బాపురావు
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : వర్షాకాలం సాగులో భాగంగా రైతులు పంట పొలాల్లో నాణ్యమైన విత్తనాలు వేసుకొని అధిక దిగుబడి సాధించాలని వ్యవసాయశాఖ భూపాలపల్లి జిల్లా అధికారి బాపురావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన విత్తనం-రైతు నేస్తం అనే అంశంపై మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా అధికారి మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సీటీలో తయారు చేసిన డబ్ల్యూజీఎల్-962, పెసర విత్తనాలు ఎం జీజీ-385 రైతులకు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వరి విత్తనం పదికిలోల బ్యాగ్ ధర రూ.50, పెసర విత్తనం మూడు కిలోల బ్యాగ్ ధర రూ.50 రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ గ్రామానికి వరి 2 సంచులు, పెసర ఒక సంచి చొప్పున మొత్తం 90 సంచులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ పూర్ణిమ, ఏఈఓలు దీపక్, అస్మ, రాజన్న, రైతులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES