Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంచరిత్ర పుస్తకాలు తప్పుల తడకలు

చరిత్ర పుస్తకాలు తప్పుల తడకలు

- Advertisement -

– జోధా-అక్బర్‌ వివాహం ఓ అబద్ధం : రాజస్థాన్‌ గవర్నర్‌ బగాడే వక్ర భాష్యం
ఉదరుపూర్‌:
చరిత్ర పుస్తకాలు తప్పుల తడకలు అని రాజస్థాన్‌ గవర్నర్‌ హనిభావు బగాడే చెప్పారు. మొఘల్‌ చక్రవరి అక్బర్‌కు, రాజపుత్ర రాకుమారి జోధా భారుకి వివాహమే జరగలేదని తెలిపారు. అది ఓ కట్టుకథ అని, బ్రిటన్‌ చరిత్రకారుల ప్రభావానికి లోనై అప్పట్లో అలాంటి చారిత్రక అబద్ధాలెన్నో చెప్పారని అన్నారు.ఉదరుపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అక్బర్‌ పాలనకు సంబంధించిన అధికారిక ‘అక్బర్‌నామా’లో జోధా, అక్బర్‌ల వివాహ ప్రస్తావనే లేదని చెప్పారు. ‘జోధా, అక్బర్‌లు వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ కథపై ఓ సినిమా కూడా తీశారు. చరిత్ర పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కానీ అది ఓ అబద్ధం…భర్మల్‌ అనే రాజు ఉండేవాడు. అతను ఒక పనిమనిషి కుమార్తెను అక్బర్‌కు ఇచ్చి వివాహం చేశాడు’ అని బగాడే తెలిపారు. వాస్తవానికి చరిత్ర ఏం చెబుతోందంటే…అమెర్‌ (ఇప్పటి జైపూర్‌) రాజు భర్మల్‌ కుమార్తెను అక్బర్‌ 1562లో వివాహం చేసుకున్నాడు. అయితే చరిత్ర పుస్తకాలలో ఆమె జన్మనామం ప్రస్తావన లేదు. అమె పేరు హర్ఖా భారు లేదా హర్ఖన్‌ చంపావతి అని కొన్ని వర్గాలు సూచించాయి. ఏదేమైనా ఈ వివాహాన్ని అనేక మంది చరిత్రకారులు మొఘలులు, రాజపుత్రుల కలయికగా అభివర్ణించారు. ఈ వివాహం కారణంగా శక్తివంతమైన భారత రాజుల విధేయత పొందడం ద్వారా మొఘల్‌ సామ్రాజ్యం బలోపేతమైంది. అయితే గవర్నర్‌ బగాడే ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ‘మన హీరోల చరిత్రలను బ్రిటీష్‌ వారు మార్చేశారు. వారు చరిత్రను సరిగా రాయలేదు. చరిత్రకు వారు చెప్పిన భాష్యం తొలుత ఆమోదం పొందింది. ఆ తర్వాత కొందరు భారతీయులు చరిత్రను రాశారు. కానీ అది ఇప్పటికీ బ్రిటీష్‌ వారి ప్రభావంలోనే ఉంది’ అని ఆయన చెప్పారు. అక్బర్‌కు రాజపుత్ర పాలకుడు మహారాణా ప్రతాప్‌ ఓ ఒప్పందపు లేఖ రాశారన్న చరిత్రకారుల వాదనను కూడా బగాడే తోసిపుచ్చారు. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నదని మండిపడ్డారు. మహారాణా ప్రతాప్‌ ఎన్నడూ తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేదని చెప్పారు. చరిత్రకారులు అక్బర్‌ను గురించి ఎక్కువగా, మహారాణా ప్రతాప్‌ గురించి తక్కువగా చెప్పారని ఆరోపించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోందని, లోపాలను సవరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం కింద భవిష్యత్‌ సవాళ్లకు సిద్ధపడేలా కొత్త తరాన్ని తయారు చేయడం జరుగుతోందని, అదే సమయంలో మన సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకుంటున్నామని బగాడే చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -