- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా నేడు నిజామాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేకమైన హెలికాప్టర్లో కలెక్టరేట్ ఆవరణలోని హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపుబోర్డును ప్రారంభించి.. నిజామాబాద్ – కంటేశ్వర్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డి. శ్రీనివాస్ విగ్రహాన్ని విష్కరిస్తారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
- Advertisement -