- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ : భిక్కనూరు పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది లింగాల రాజబాబు గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు.
- Advertisement -


