నవతెలంగాణ-కమ్మర్ పల్లి
జిల్లా ఉత్తమ రైతుగా అవార్డ్ అందుకున్న మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన మండల కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున ఘనంగా సన్మానించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ రైతుగా అవార్డ్ అందుకున్న బోనగిరి భాస్కర్ ను పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ మండలానికి చెందిన బోనగిరి భాస్కర్ జిల్లా ఉత్తమ రైతుగా అవార్డు అందుకోవడం మండల రైతులందరికీ గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా పంటల సాగులో అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మరెన్నో అవార్డులను పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి తక్కురి దేవేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు పూజారి శేఖర్, నల్ల గణేష్ గుప్తా, సుంకేట శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉత్తమ రైతు అవార్డు గ్రహీతకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES