- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల నూతన విద్య అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన మండలంలోని శివన్నగూడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు జి.శారదను శనివారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కన్వీనర్ గిరి యాదయ్య,టి ఎస్ యుటిఎఫ్ మండల ఉపాధ్యక్షులు ఎస్.వెంకట్ కుమార్,మండల కమిటీ సభ్యులు హనుమంతు,అనురాధ,శ్రీనయ్య,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాలతి,జయప్రద,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య,లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



