- Advertisement -
ఆదుకోవాలి బాధితులు విజ్ఞప్తి..
నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మి అనే వితంతు మహిళ ఇల్లు పాక్షికంగా దెబ్బతిని నేలమట్టమైంది. ఇల్లు కూలడంతో నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసి ముద్దాయ్యాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నామని, ఈనె 23వ బుధవారం కురిసిన భారీ వర్షానికి ఇళ్లు కూలిపోయినట్లుగా బాధితురాలు కన్నీరుమున్నీరైయింది. ప్రభుత్వ ఆదుకోవాలని అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నట్లుగా విజ్ఞప్తి చేస్తోంది.
- Advertisement -