- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ర్యాగట్ల పల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని హౌసింగ్ డిప్యూటీ ఈ ఈ సుభాష్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో బిల్లులు వస్తాయని లబ్ధిదారులకు తెలిపారు. ఈ పరిశీలనలో డిప్యూటీ హౌసింగ్ ఈ ఈ తో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
- Advertisement -