- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మిడ్జిల్ గ్రామపంచాయతీకి సంత వేలం ద్వారా రూ. 21 లక్ష 33 వేలు బహిరంగ వేలం పాట ద్వారా వచ్చినట్టు ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన వేలం ద్వారా పశువుల సంతకు రూ.19 లక్షల 60 వేలకు రామ్ గౌడు దక్కించుకున్నారు. కూరగాయల సంత రూ.1 లక్ష 73 వేల 750కి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



