Friday, June 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకేజీబీవీ పాఠశాలలో భారీ కొండచిలువ కలకలం..

కేజీబీవీ పాఠశాలలో భారీ కొండచిలువ కలకలం..

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: కేజీబీవీ పాఠశాలలో భారీ కొండచిలువను స్థానిక విద్యార్థులు చూసి భయభ్రాంతులకు గురైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న‌ ఉదయం పాఠశాలలోని బాలికల వసతిగృహానికి చెందిన ఓ మ‌రుగుదొడ్డిలో సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను సిబ్బంది గుర్తించారు. కేజీబీవీ ఎస్ఓ అర్చ‌న‌, ఉపాధ్యాయులు పారిశుద్ధ్య కార్మికుల‌తో మ‌రుగుదొడ్ల‌ను శుభ్రం చేయిస్తున్న స‌మ‌యంలో ఓ టాయిలెట్‌లో ఈ భారీ కొండ‌చిలువ క‌నిపించింది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బీట్ అధికారి అశోక్‌, హ‌నుమకొండ‌లోని జూపార్క్ సిబ్బంది హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. వారు ఎంతో చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. అటవీశాఖ అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -