నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశా పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల నియామకాల్లో భారీ స్కాం వెలుగులోకి వెచ్చింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పరీక్షలు నిర్వహించే ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 150 మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశా సబ్-ఇన్స్పెక్టర్ (SI) నియామక పరీక్షలో భారీ మోసాన్ని బెర్హంపూర్ పోలీసులు బయటపెట్టారు.SI నియామక పరీక్ష నిర్వహించే బాధ్యత తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ స్కాం కు పాల్పడినట్లు గుర్తించారు. నియామకాల్లో అవకతవలకు పాల్పడేందుకు తరలిస్తున్న ట్లు ఆరోపణలు రావడంతో ఈ స్కాంతో సంబంధమున్న 150మందికి పైగా అభ్యర్థులను అరెస్ట్ చేశారు. పరీక్షల్లో మోసాలకు పాల్పడే వ్యూహంలో భాగంగా హైదరాబాద్కు తీసుకెళ్తుండగా 150 మందికి పైగా అభ్యర్థులను బెర్హంపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశా SI నియామకాల్లో భారీ స్కాం.. 150 మంది అభ్యర్థుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES