నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతుల్ గ్రామంలో భూ తగాదాలు బగ్గుమన్నాయి. శనివారం ఇద్దరి తగాదుల మధ్య మాట మాట పెరిగి గొడ్డలితో నరుక్కునే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే ఐతోల్ గ్రామానికి చెందిన తిరుపతమ్మ గోపాల్ రెడ్డి దంపతుల పై దాయాది కృష్ణారెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భార్య భర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువురి మధ్య గత కొంతకాలంగా భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు తెలిపారు. శనివారం దుక్కిదున్నేందుకు ఇరువురు భార్యాభర్తలు పొలంలోకి వెళ్లడంతో కృష్ణారెడ్డి వచ్చి అడ్డు చెప్పాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మాట పెరగడంతో కృష్ణారెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
భార్యాభర్తలపై గొడ్డలితో దాడి..తీవ్ర గాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES