అప్పుల వేధింపులతోనే అని అనుమానం
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్: నగరంలోని నాలువ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాయత్రి నగర్ లో భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో ఉంటున్న పులిశెట్టి శ్రీనివాస్ (52), మమత (48) లు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డారు. ప్రింటింగ్ ప్రేస్ లో పనిచేసే శ్రీనివాస్ కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేయగా ఇద్దరు కుమారులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెల్లినట్లు తెలిసింది. నగరంలోని కోటగల్లిలో ఉన్న ఇంటిని అమ్ముకుని ఇటీవల గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నారు. గత రాత్రి అప్పుల వారు వేదించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. అప్పుల వారు వేదించడంతో పరువు పోయిందని దంపతులు ఉరివేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై నగర సిఐ శ్రీనివాస రాజు, నాలువ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ల వివరణ కోరగా.. దంపతుల ఆత్మహత్య విషయం తెలిసిందని ప్రాథమికంగా వివరాలు తెలియదని తెలిపారు. పూర్తి వివరాలను మళ్లీ వెల్లడిస్తామని అన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు దంపతుల మృతికి గల కారణాలపై ఆరా తీస్తూ, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధిక వడ్డీ వసూళ్లపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయినా నిజామాబాద్ జిల్లాలో ఉన్న వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉరేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES