- Advertisement -
– ఆర్ధిక సహకారం అందించిన సాటి ఉద్యోగులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రమాదానికి గురైన ఉపాద్యాయురాలి భర్త కు చికిత్స నిమిత్తం సాటి ఉపాద్యాయ, ఉద్యోగులు ఆర్ధిక సహకారం అందించారు. మండలంలోని మామిళ్ళవారిగూడెం జెడ్పీ హెచ్ ఎస్ పీడీ కొర్సా కుమారి భర్త నాగేశ్వరరావు ఇటీవల ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుముక కు తీవ్రగాయాలు అయి ప్రస్తుతం ఖమ్మంలోని కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.
ఇందుకోసం సుమారు రూ.4 లక్షల ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో మానవతా దృక్పథంతో సాటి ఉపాద్యాయ ఉద్యోగులు తమవంతు వంతు సాయం గా రూ.40 వేలు కొర్స కుమారికి శుక్రవారం అందించారు.
- Advertisement -



