Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుభర్త వివాహేతర సంబంధం.. విసుగెత్తిన భార్య ఏంచేసిందంటే..?

భర్త వివాహేతర సంబంధం.. విసుగెత్తిన భార్య ఏంచేసిందంటే..?

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
వివాహేతర సంబంధం ఆరు సంవత్సరాలైనా వీడని అక్రమ సంబంధంతో విసుగెత్తిన మహిళ తీవ్ర అసహనానికి లోనై భర్తకు లైంగిక సంబంధమున్న వ్యక్తికి గుండు గీయించి తీవ్రంగా కోట్టిన సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనానికి రేకెత్తించింది. శనివారం మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో రాత్రి కాజీపేట ఏసిపి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు నాగరాజు భార్య అయిన రమ, వారి సమీప బంధువైన చిక్కుడు రాజుతో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో వారు ఇద్దరికి గుండు గీయించి తీవ్రంగా చిత్రహింసలకు గురి చేయడం జరుగుతుందని తెలిపారు. వీరిద్దరు కూడా నర్సంపేటలోని నల్లబెల్లి మండలానికి వెళ్లారని తెలిపారు.

అక్కడికి మా పోలీస్ బృందాలను కూడా పంపడం జరిగిందని, వారు తెల్లవారుజామునే అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగిందని విచారణ తేలిందని తెలిపారు. ఈ క్రమంలో ఈ సంఘటనపై శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో వీరిపై దాడికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. దీంతో బాధితులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఈ సంఘటన వివరాలపైన స్థానికులు, పోలీసులు, భార్య తెలిపిన వివరాల ప్రకారం.. సంసారాన్ని సాఫీగా కొనసాగించేందుకు భర్తను గ్రామ పెద్దమనుషుల సమక్షంలో నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో, వరంగల్ మహిళ పోలీస్ స్టేషన్లో పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. సదరు వ్యక్తులు మనసు మార్చుకోకపోవడంతో తీవ్ర అసహనానికి లోను కావడం, ఈ సంఘటనకు కారణమైందన్నారు. ఆరు సంవత్సరాలుగా నా భర్తను తమ గుప్పెట్లో పెట్టుకుని, అతన్ని నాకున్న సంతానాన్ని నన్ను చంపించేందుకు పలుమార్లు పథకం వేసి, కత్తులతో మందు డబ్బాలతో, వార గడ్డపారలతో నా మీదకి ఉసిగొల్పారు. ఈ క్రమంలో సంసారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నాళ్లకైనా తను మనసు మార్చుకుంటాడని, కంటికి రెప్పలా కాపాడుకుంటూన్న క్రమంలో గత 10 రోజుల ముందు నుండి ఇద్దరు బాధిత వ్యక్తులు కనిపించకుండా పోయారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయన భార్య తన తల్లిగారిల్లు అయిన తాటికాయల గ్రామానికి వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై వారు ఉన్న చోటు ఈనెల 22, 23 తేదీలలో గ్రామంలోని సోదరులకు విషయాన్ని తెలియజేయడంతో, వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ విషయంపై గ్రామ పెద్దలకు గాని, పోలీసులకు గాని ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా బాధిత వ్యక్తులను వారి గ్రామానికి తీసుకొని రావడం జరుగుతుందని ఆరోపించారు. మొదట మంచిగా మాట్లాడే ప్రయత్న చేశారు. అయినా మాట వినకపోవడంతో ఇద్దరికి దేహశుద్ది, గుండు గీయించారు. అంతేకాకుండా తన సంసారాన్ని ఆగం ఆగం చేస్తున్నవని ఆమె మర్మంగాలకు జీడి పోసేందుకు పూనుకోవడం వాస్తవమే.. కానీ జీడి రాయలేదని ఆరోపించారు. ఇప్పటివరకు వారి ఆచూకీ దొరకలేదని రమ భర్త నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -