71వ జాతీయ చలన చిత్ర పురస్కార గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి
భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ను నిలపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగ ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన తెలిపారు.
71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన ‘భగవంత్ కేసరి’ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పథ్వీ, ‘బేబీ’ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ‘హనుమాన్’ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, ‘బేబి’ సినిమా నిర్మాత ఎస్కేఎన్, ‘భగవంత్ కేసరి’ నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు.
భారతీయ సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్
- Advertisement -
- Advertisement -