- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది. చలి కాలం కావటంతో అంతకంతకూ వాయు కాలుష్యం పెరుగుతోంది. వాయు కాలుష్యం స్థాయి డేంజర్ స్థాయికి చేరుకుంటోంది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలుబు, దగ్గు, తుమ్ములతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 220కి చేరుకుంది. తిరుమలగిరిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200కు చేరుకుంది.
- Advertisement -



