సెమీస్లో హర్యానాపై ఘన విజయం
చెన్నై : ఆల్ ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ సెమీఫైన్లలో హర్యానాపై 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో సెమీస్లో జమ్ము కశ్మీర్పై టిఎన్సీఏ (తమిళనాడు క్రికెట్ సంఘం ఎలెవన్) విజయం సాధించింది. టైటిల్ పోరులో హైదరాబాద్, టిఎన్సీఏ ఎలెవన్ తలపడనున్నాయి. హైదరాబాద్ వరుసగా 225/10, 254/10 పరుగులు చేయగా.. హర్యానా తొలి ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో విలువైన ఆధక్యం సాధించిన హైదరాబాద్… రెండో ఇన్నింగ్స్లో బారీ స్కోరు చేసింది. హర్యానా రెండో ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్ 90 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ బౌలర్ నితిన్ సాయి యాదవ్ (7/44) ఏడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో 91 పరుగుల ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పిన హైదరాబాద్ బ్యాటర్ వరుణ్ గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.