Thursday, June 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసినీసిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి

సినీసిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి

- Advertisement -

– 14న గద్దర్‌ సినిమా అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలి :
– సినీరంగ సమగ్రాభివృద్ధి సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
– డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సినీ రంగానికి హైదరాబాద్‌ నగరాన్ని రాజధానిగా, సినీసిటీగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్‌ కమిటీ చైర్మెన్‌ మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈనెల 14న తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డ్స్‌ ఫంక్షన్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు. సమావేశానికి దేశంలోని ప్రముఖ సినీనటులను ఆహ్వానించాల న్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రుల సబ్‌కమిటీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో పాటు సమాచార శాఖ కమిషనర్‌, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్‌ చేయా లంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్‌ శాఖ వంటి వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి వస్తుండటంతో సినిమా నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు. ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఒక అధికారిని నియమించి వారి ద్వారా అన్ని శాఖల అనుమతులు త్వరితగతిన ఇప్పించేలా సింగిల్‌ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతా ల్లో షూటింగ్‌లు చేసేలా చర్యలు తీసుకుంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్లలో క్యాంటీన్ల ద్వారా తినుబండాలు, ఇతర వస్తువులు అత్యధిక రేట్లకు విక్రయించడంవల్ల సామాన్యులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరలను నియం త్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు మంజూరు చేసిందనీ, ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి, పూర్తి వివరాలను వచ్చే సమావేశం నాటికి అందజే యాలని ఆదేశించారు. సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీపై ఏర్పాటుచేసిన ఆర్‌సీఎస్‌ కమిటీనీ వచ్చే సమావేశానికి పిలిపిం చాలని సూచించారు. సమావేశంలో ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ దిల్‌ రాజు, హౌం శాఖ స్పెషల్‌ సీఎస్‌ రవిగుప్తా, సమాచార శాఖ కమిషనర్‌ హరీష్‌, ఎఫ్‌డీసీ డైరెక్టర్‌ కిషోర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -