Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతాను స్వ‌తంత్ర శాస‌న‌స‌భ్యుని: ఎమ్మెల్యే రాజాసింగ్

తాను స్వ‌తంత్ర శాస‌న‌స‌భ్యుని: ఎమ్మెల్యే రాజాసింగ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేప‌ట్నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు..బీజేపీ ఎమ్మెల్యేగా కాకుండా స్వ‌తంత్ర శాస‌న‌స‌భ్యునిగా అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

తెలంగాణలో బీజేపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. పార్టీలోని కొందరు నేతల వైఖరి వల్లే ఈ దుస్థితి దాపురించిందని, వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. “ఇప్పుడు నాకు ఎవరూ బాస్‌లు లేరు. నన్ను ఎవరూ అదుపు చేయలేరు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికింది” అని రాజాసింగ్ అన్నారు.

తానుగా మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. కేవలం పార్టీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తేనే తిరిగి చేరికపై ఆలోచిస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -