నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సుశిక్షితులైన పోలీసుల బ్యాండు వింటే తాను మైమరచిపోతాననీ, వారి వాద్యాల నుంచి వచ్చి ట్యూన్లను వింటే పరిసరాలను కూడా మరచిపోతామని రాష్ట్ర డీజీపీ జితేందర్ అభినందించారు. ఆర్బీవీఆర్ పోలీసు అకాడమీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పోలీసు బ్యాండ్ కళాకారుల శిక్షణ ముగింపు ఉత్సవానికి డీజీపీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విధి నిర్వహణలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖలో ఒక చక్కటి బ్యాండు మ్యూజిక్ను వినిపిస్తున్న ఈ కళాకారులు వారిలో ఉన్న సున్నితమైన మనస్తత్వాన్ని, సంగీత హృదయాన్ని పరిమళింపజేస్తున్నారని ఆయన అన్నారు. పోలీసు శాఖకు చెందిన కార్యక్రమాలేగాక ప్రయివేటు ప్రజల కార్యక్రమాలను కూడా పోలీసు మ్యూజిక్ బ్యాండ్ కళాకారులు కార్యక్రమాలను నిర్వహిస్తూ వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నారని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు బ్యాండులోని వివిధ వాయిద్యాలతో తమ ప్రతిభ కనబర్చిన కళాకార పోలీసులను డీజీపీ శాలువతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్, సైబరాబాద్ కమిషనర్ ఎ.కె మొహంతితో పాటు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పోలీసు బ్యాండ్ వింటే మైమరచిపోతా : డీజీపీ జితేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES