Wednesday, June 25, 2025
E-PAPER
Homeజాతీయంఇష్టం లేని పెళ్లి చేసుకున్న.. న‌న్ను తాకితే చంపేస్తా

ఇష్టం లేని పెళ్లి చేసుకున్న.. న‌న్ను తాకితే చంపేస్తా

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ఉత్తరప్రదేశ్‌లో ఓ నవ వధువు మొదటి రాత్రి గదిలోకి కత్తి తీసుకెళ్లి చంపేస్తానంటూ భర్తను బెదిరించి హల్‌చల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన నిషాద్‌ అనే వ్యక్తికి ఇటీవల సితార అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగానే కన్పించిన ఆ వధువు.. మొదటి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా’ అంటూ బెదిరించింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను అమన్‌ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.

దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్‌ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్‌తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -