నవతెలంగాణ – మునిపల్లి
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మేళసంఘం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుప్నాగారం లక్ష్మి తన ప్రచార పర్వాన్ని జోరంందుకున్నారు. ఇంటిట ప్రచారం చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో గ్రామాన్ని మరింత ముందడుగులో నడిపిస్తానని హామీ ఇస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలో అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని అభ్యర్థి లక్ష్మీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గౌ రెడ్డి గారి నారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సంగమేశ్వర్, గ్రామ శాఖ నాయకులు పడమటి సంగన్న, నాయకులు ఖ్యాతం రవీందర్, రాయికోడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బేగరి మొగులమ్మ, యువత నాయకులు బేగరి మల్లేశం సోషల్ మీడియా కన్వీనర్ కళ్లపల్లి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాన్ని మరింత ముందడుగులో నడిపిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



