నగర కొత్వాల్గా వి.సి సజ్జనార్
హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా సి.వి ఆనంద్
ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్ కుమార్
ఏసీబీ డీజీగా చారుసిన్హా
మొత్తం 23 మంది ఐపీఎస్లు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో డీజీపీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. నగర పోలీసు పగ్గాలను వి.సి సజ్జనార్కు, ఇంటెలిజెన్స్ బాధ్యతలను విజరు కుమార్కు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ బాధ్యతలను సి.వి ఆనంద్కు అప్పగించిన ప్రభుత్వం.. ఏసీబీ పగ్గాలను చారుసిన్హా చేతికి ఇచ్చింది. అలాగే ఆర్టీసీ ఎండీ బాధ్యతలను వై.నాగిరెడ్డికి అప్పగించిన ప్రభుత్వం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్గా షికా గోయెల్ను నియమించింది. మొత్తమ్మీద 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
వారి వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.
