- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. అక్రమ మైనింగ్ కేసులో కోర్టు ఇప్పటికే శ్రీలక్ష్మిని నిందితురాలిగా తేల్చడం, తాజాగా రివిజన్ పిటిషన్ కొట్టివేయడంతో ఆమె పాత్రపై సీబీఐ విచారణ కొనసాగనుంది.
- Advertisement -