Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐసీడీఎస్ ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాల్సిందే

ఐసీడీఎస్ ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాల్సిందే

- Advertisement -

సుప్రీం ఆదేశాలను అమలు చేస్తూ అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేయాలి
జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొనండి
– సీఐటీయా జిల్లా కోశాధికారి జీ.భాస్కర్
నవతెలంగాణ – దుబ్బాక 
: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని , ఐసీడీఎస్ ప్రయివేటీకరణ ను వెంటనే ఉపసంహరించాలని, అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేస్తూ వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపులో భాగంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ పాల్గొంటామంటూ తెలియజేస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తిరుపతికి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి జీ.భాస్కర్ మాట్లాడుతూ.. కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ రద్దు చేస్తూ వాటి స్థానంలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తుందని విమర్శించారు. ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు జరిగితే, కార్మిక సంఘాల ఏర్పాటు కష్టమవుతుందని, అలాగే కార్మికుల సమిష్టి బేర సారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె హక్కు, ఉద్యోగ భద్రత, ఉపాధిని కోల్పోవడం జరుగుతుందని వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని, టీచర్లకు రూ.32000, హెల్పర్లకు రూ.26,000 కనీస వేతనంగా చెల్లించాలన్నారు. రిటైర్మెంట్ కనీస పెన్షన్ రూ.9000, ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారి వెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దుబ్బాక ప్రాజెక్టు అధ్యక్షురాలు జీ.పద్మ, కోశాధికారి యం.నాగరాణి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -