నవతెలంగాణ – వనపర్తి
తెలంగాణ ప్రభుత్వం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని 0 – 18 సం దివ్యాంగులకు అవసరాల కోసం నిర్ధారించిన పరికరాలను గుర్తించే కార్యక్రమం వనపర్తి లోని భవిత కేంద్రం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులను గుర్తించినట్లు ఐ ఈ కో ఆర్డినేటర్ బి. ప్రతాప్ రెడ్డి తెలిపారుు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ అలెంమకో సంస్థ ద్వారా డాక్టర్ సుబ్రతో, తుషార్ లు దివ్యాంగులను పరిశీలించి వారికి అవసరమైన పరికరాలను గుర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి మద్దిలేటి, ఏ ఎం ఓ మహనంది, ప్లానింగ్ అధికారి శేఖర్, ఏ పీ ఓ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఐ ఈ ఆర్ పి మహేష్, ఆనంద్, సంతోష్ లక్ష్మయ్య ఖాజా ఉమ రజిత మల్లిశ్వరి మొదలగు వారి సహకారంతో ఈ గుర్తింపు కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు పరికరాల గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES