నవతెలంగాణ -తాడ్వాయి
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం విలేఖరులతో మాట్లాతూ.. ట్రాఫిక్ నిబంధన ఉల్లంగించే వారిపై ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ ఆధ్వర్యంలో జిల్లా అంతట ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా తాడ్వాయి మండలంలో వివిధ రోడ్డు వినియోగదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని, రద్దిగా ఉండే సమయంలో మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం కూడా పెరుగుతుందని, దీనివల్ల ప్రమాదాలు మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. రోడ్డు పై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. వారం రోజులు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలు నడిపే ప్రజలు రోడ్డు నిబంధన, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం, 18 సంవత్సరాల లోపు (మైనార్టీలు) వాహనం నడపడం, రిజిస్ట్రేషన్ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ మరియు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్నట్లు తేలితే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సును అనర్హులుగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మీ వాహనం సీజ్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES