Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖద్దరుకు తోడుంటే.. ఇంటికే.!

ఖద్దరుకు తోడుంటే.. ఇంటికే.!

- Advertisement -

సర్కారు ఉద్యోగులూ తస్మాత్ జాగ్రత్త..
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎన్నికలంటే అన్ని వర్గాలకు సంబరమే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు దూరంగా ఉండాల్సిందే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్న తాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్ వేటు పడనుంది. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవ ర్తనా నియమావళి కొనసాగుతున్నందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి.ఉద్యోగులు ఏ మాత్రం అనుచితంగా వ్యవహరించినా వేటు వేయడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి కొమ్ముకాయడం తగదని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతో పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ఫ్రాగామ్ పోస్టులపై కూడ ఓ కన్నేసింది.

సభలు.. సమావేశాలు వద్దు..
ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకుని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచినా నష్టం జరుగుతుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలం గానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడిది పెను ముప్పే. ఆడియో, వీడియోల ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి కానీ అందుబాటులో ఉన్న యంత్రాంగానికి పంపినా లేదా ప్రచార మాధ్యమాల్లో పోస్టు చేసినా అంతే సంగతు లని గత ఉదంతాలు చాటుతున్నాయి.

ఉద్యోగులు ఎటువైపు.?
సర్పంచి ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఏరికోరి ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది.కొన్నీ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలముంటే,మరికొన్ని సంఘాలు ప్రతికూలమంటున్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిని మాత్రమే చూస్తామని, ఏ పార్టీ వ్యక్తన్నది అనవసరమని ఉద్యోగులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -