- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరినప్పుడు మంత్రి పదవి ఆఫర్ చేశారని తెలిపారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు థాక్రే, మహేశ్ కుమార్ గౌడ్ వంటి నేతలు తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి హామీ నెరవేర్చడంలో ఇబ్బందులు ఉండవచ్చునని, కానీ పిలిచి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామని చెప్పకపోవడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -



