Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఐఐటి ర్యాంకర్ మునీబ్ కు సన్మానం..

ఐఐటి ర్యాంకర్ మునీబ్ కు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ సంజీద తబస్సుమ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల కుమారుడు సయ్యద్ మునీబ్ జాతీయ స్థాయిలో ఐఐటి లో 2664 ర్యాంక్ సాధించిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా కర్షక్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ కె రషీద్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మునీబ్ జాతీయ స్థాయిలో 2664 ర్యాంక్ సాధించడం జిల్లాకే గర్వకారణం అని అన్నారు. కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత లక్ష్యాన్ని అయినా సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్, ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణ, విజయరామరాజు, కిషన్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad