– మహేష్ను ఇండియాకు రప్పించి అన్ని విధాలా ఆదుకుంటాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
‘బాధపడకండి.. బాధ్యత నేను తీసుకుని మహేష్ను ఇండియాకు తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకుంటానని’ గల్ఫ్ బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేష్ జీవనోపాధి కోసం గల్ఫ్లోని సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేష్తో వీడియో కాల్లో కేటీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అండగా ఉంటానని మహేష్కు ధైర్యం చెప్పి, మనోళ్లను పంపించి అండగా ఉండే విధంగా అన్ని రకాలుగా చూస్తానని కుటుంబానికి భరోసానిచ్చారు. సొంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తానని తెలిపారు.
బాధ పడకండి.. నేను బాధ్యత తీసుకుంటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES