నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం నీల గ్రామ శివారులోనున్న వాగుల నుంచి అక్రమ ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. పగలు ట్రాక్టర్ల పై ప్రధాన రోడ్డు వెంబడి డబ్బులు చేసి రాత్రి సమయాల్లో వాటిని తరలిస్తున్నట్లు తెలిసింది. స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిల్వల ను సీజ్ చేసి ఇటీవల మండలంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కేటాయించామని తహసిల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శివారులోనున్న ఇసుక డంపులను పరిశీలించడం జరిగిందని, వాటిని స్విజ్ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇట్టి నిలవాలపై రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నిగా ఏర్పాటు చేసినట్లు తెలిసింది..
రెంజల్ మండలం నీలా శివారులో అక్రమ ఇసుక డంపులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES