Sunday, June 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపార్లమెంటరీ డిప్లమసీ ప్రాముఖ్యత

పార్లమెంటరీ డిప్లమసీ ప్రాముఖ్యత

- Advertisement -

పహల్గాం నేపథ్యంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిందని.. ప్రపంచానికి చెప్పటానికి మన పార్లమెంటు బృందాలు పలు దేశాలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప థ్యంలో పార్లమెంటరీ దౌత్యం ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం ముదావహం.
రెండు దేశాల మధ్య వుండే చుట్టరికాన్ని దౌత్య సంబంధం అంటారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య నడిచే వ్యవహారం. ఈ వ్యవహారాన్ని నడపటానికి రాయబారులు, దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇది ఒక ఎత్తైతే, రెండు దేశాల ప్రజల మధ్య సంబం ధాలను బలోపేతం చెయ్యటానికి అనధికార మార్గా లు చాలా ఉంటాయి. ఈ అనధికార మార్గాలు ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే వుంటాయి. కానీ వీటి పరిధి విశాలంగా ఉంటుంది. ఈ మార్గాల్లో పార్లమెంటరీ దౌత్యం ముఖ్యమైనది. ఒక దేశ పార్లమెంటు నెరిపే దౌత్యంతో మరో దేశం సులభంగా కనెక్ట్‌ అవుతుంది. ఇది ఇరు ప్రజలకు మధ్య వ్యవహారం. అందుకే పార్లమెంటరీ దౌత్యాన్ని ట్రాక్‌ 2 డిప్లమసి అంటారు. పార్లమెంటు సభ్యులకుండే సౌలభ్యం దౌత్యవేత్తలకు ఉండదు. దౌత్యవేత్తలు ఒక చట్రంలో పని చేస్తారు.
పార్లమెంటరీ బృందాలు ఒప్పందాలు చెయ్య వు. ఒడంబడికలు కుదుర్చుకోవు. అవి చేసేదల్లా ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం కలగ చెయ్యటమే. దౌత్యవేత్తలు ఒక మాట అన్నారంటే అది ప్రభుత్వ విధానం అవుతుంది. పార్లమెంటు సభ్యులు చెప్పేది ప్రజల మనోభావన. దానిలో ఒక భావోద్యేగం వుంటుంది. దాన్ని ప్రభుత్వ విధాన ప్రకటనగా చూడరు.
పైగా వారి భాష దౌత్య భాషకు భిన్నంగా వుం టుంది. అందుకే పార్లమెంటు సభ్యుల మాటలు వినే వారు బాగా కనెక్ట్‌ అవుతారు. పార్లమెంటరీ దౌత్యం లో మరో ముఖ్యమైన విషయం, స్వదేశంలో ప్రభు త్వానికి విపక్షాలకు అభిప్రాయ బేధాలున్నా, విదేశీ గడ్డ మీద అందరూ ఒకే మాట మీద నిలబడతారు. ఇది మన సంప్రదాయం. అందుకే పార్లమెంటు బృం దాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసినా, వారి మాట పార్టీ విధానంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉంటుంది. ఇది మన పార్లమెంటరీ సంప్రదాయపు ఔన్నత్యం. విదేశాలతో సంబంధాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశం. ఆ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకునే పార్లమెంటు సభ్యులు వారి దౌత్యాన్ని నెరుపుతారు.
పార్లమెంటరీ దౌత్యానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే దౌత్య అధికారు లకు లేని స్వేచ్ఛ వీరికి ఉంటుంది. అందుకనే కొన్ని సందర్భాల్లో ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి చెప్పటానికి వెనకాడే విషయాలను పార్లమెంటరీ దౌత్యం ద్వారా సాకారం అవుతుంది. పార్ల మెంటు బృందం ఒక దేశ పర్యటనకు బయల్దేరే ముందు ఆ బృందంలో సభ్యులు ఎవరు అనేది ఆయా పార్టీల నేతలు నిర్ణయిస్తారు. ప్రస్తుత సంద ర్భంలో ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వం పాటించ లేదు. ఇటువంటి సమయంలో రాజకీయ కోణం లేకపోతే బాగుండేది. దేశ ప్రయోజనం ముఖ్యమైన ప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి కదా. అలా చేయకపోవటం అనుచితం. దానిమీద వివాదం చెయ్యటానికి ఇది సరైన సమయం కాదు.
పార్లమెంటరీ బృందం పర్యటనకు ఒక దేశం వెళ్లే ముందు చాలా కసరత్తు ఉంటుంది. అక్కడ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి? దానికి మన వారి స్పందన ఎలా వుండాలి? అవతలి వారితో మనం ఏ అంశాలను, ఏ మేరకు కదపాలి? అన్న విషయాల మీద విదేశాంగ శాఖ అధికారులు పార్లమెంటు సభ్యుల బృందానికి బ్రీఫింగ్‌ ఇస్తారు. సదరు బృందం పర్యటించే దేశానికి మనకు మధ్య వున్న సంబంధాల బలం, బలహీనత లాంటి అంశా లను అధికారులు వివరిస్తారు. ఆ అవగాహనతో పార్లమెంటు సభ్యులు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.
ప్రభుత్వ అధినేతలుగానీ, మంత్రులుగానీ, దౌత్య అధికారులుగానీ వ్యవహరించటానికి కొన్ని ప్రోటోకాల్స్‌ వుంటాయి. పార్లమెంటు సభ్యులు ఈ ప్రోటోకాల్‌ చట్రంలో వుండరు. వీరికుండే సౌలభ్యం దౌత్యవేత్తలకు ఉండదు. పార్లమెంటు సభ్యులకు అనేక వర్గాలతో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఆ వర్గాల వారు పార్లమెంటు సభ్యులతో పాటుగా, ఆ దేశ మేధావులు, కవులు, కళాకారులు, విద్యా వేత్తలు, మీడియా సంస్థలు, అక్కడ స్థిరపడిన మన దేశపు సంతతి వారు.. వీరందరితో కలివిడిగా మాట్లాడే అవకాశం పార్లమెంటు బృందాలకు ఉంటుంది. అందుకే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రపం చానికి చెప్పటానికి, ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడగట్టటానికి భారత ప్రభుత్వం పార్లమెంటరీ బందాలను పలు దేశాలకు పంపిస్తోంది.
ఈ మధ్యకాలంలో దేశాల ప్రజల మధ్య ద్వైపాక్షిక సత్సంబంధాలు బలోపేతం అవ్వటానికి పార్లమెంటు దౌత్యం ఒక ముఖ్యమైన ఛానల్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. పార్లమెంటు బృందాలు మరో దేశంలో పార్లమెంటు సభ్యులకు మన దేశం పట్ల సుహృద్భావ వాతావరణం కలిగిస్తాయి. అలాగే ఇతర దేశాల పార్లమెంటు బృందాలు కూడా మన దేశంలో పర్యటించినప్పుడు వారి దేశపు విధానాలకు అవగాహనా కల్పిస్తుంటాయి. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో నిరంతరం జరిగే ప్రక్రియ. పార్లమెంటరీ దౌత్యాన్ని బలోపేతం చెయ్యటానికి మన దేశంలో పార్లమెంటరీ మైత్రీ సంఘాలు వున్నాయి. అవి రష్యా, చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, మంగోలియా, వియత్నాం, శ్రీలంక, యూరోపియన్‌ యూనియన్‌, లాటిన్‌ అమెరికా లాంటి ప్రాంతాలతో అనుసంధా నమై మైత్రీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు బహు పాక్షిక పార్లమెంటు సంబం ధాలు నెరపటానికి కొన్ని అంతర్జాతీయ వేదికలు న్నాయి. అందులో ముఖ్యమైనవి కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ (సీపీఏ), మరొకటి ఇంటర్‌ పార్ల మెంటరీ యూనియన్‌ (ఐపీ యూ). ఈ వేదికలు నిర్వహించే సమావేశాలు ఒక ఎజెండా ప్రకా రం నడుస్తాయి. ఉదాహరణకు పర్యావరణ సమతుల్యం, ఆహార భద్రత, బాలల హక్కుల పరిరక్షణ, లాంటి అంశాలు.
ద్వైపాక్షిక సంప్రదింపులు ఒక ఎజెండా చట్రంలో ఇరుక్కొని వుండవు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఎందుకు చేపట్టవలసి వచ్చిందీ ప్రపంచానికి చెప్పటానికి మన పార్లమెంటు సభ్యు లు సరైన ప్రతినిధులు. ఉగ్రవాద ఘాతుకాలకు మనం బలి అవుతున్నాం కాబట్టి మన పోరాటం మనం చెయ్యాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఒప్పించాలి. మన పార్లమెంటు బృందాలు ఉగ్రవాదం మీద మన దేశం వైఖరిని వివరిస్తారు. ఈ వివరణ కేవలం విదేశీ పార్లమెంటు లకే కాక అక్కడ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే పలుకుబడిగల వర్గాల వారికి కూడా వివరిస్తాయి. ఉగ్రవాదం జరిపే నరమేధానికి మన దేశం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా ఇప్పటివరకు సహనం వహించిందీ వివరిస్తారు. ఇవి ఇరు దేశాల ప్రజల మధ్య జరిగే సంప్రదింపులు. అవతలి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం, సందేహా లను నివృత్తి చెయ్యటం, అమాయక ప్రజలు ఉగ్ర వాదానికి ఏవిధంగా బలి అవుతున్నారో వివరిం చటం ఇందులోని ముఖ్యమైన అంశాలు. ఉగ్రవా దానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటానికి ప్రపం చ మద్దతు కూడగట్టటానికి గట్టి ప్రయత్నం. ‘ఆపరే షన్‌ సిందూర్‌’ అనే సైనిక చర్య ద్వారా పాకిస్తాన్‌లో వున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము. కానీ ఉగ్రవాదం ధ్వంసం కాలేదు. అది ధ్వంసం కావా లంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అందు కోసం పాకిస్తాన్‌ మీద ఒత్తిడి తేవాలి. ఉగ్రవాదం ముప్పు ఎప్పుడు, ఎక్కడ కాలు మోపుతుందన్న విష యంలో ప్రపంచమంతా అప్రమత్తంగా ఉండవల సిన ఆవశ్యకతను, బాధను అనుభవించిన జాతిగా మనం వివరించాలి.
‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో పాకిస్తాన్‌ అదేపనిగా అణ్వస్త్రాల ప్రస్తావన తేవటం ఒక విఫల మైన రాజ్యం చేసే బాధ్యతారాహిత్య ప్రేలాపనగా ప్రపంచానికి మనం చూపెట్టాలి. ఉగ్రవాదాన్ని ప్రపంచం ఒకింత ఉదాసీనతతో చూసినా, అణ్వ స్త్రాల విషయం అలా కాదు. 1945లో హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేసినప్పటి నుంచి నేటి వరకు అణ్వస్త్రాలను యుద్ధంలో ప్రయోగించాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు, ఒక్క పాకిస్తాన్‌కి తప్ప. 1945 తరువాత ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ ఏనాడూ అణు బాంబుల ప్రస్తావన తెరపైకి రాలేదు. అణ్వా యుధాలు ప్రయోగించితే మానవాళి మొత్తం న్యూక్లి యర్‌ నిర్యాణం ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అస్థిరమైన రాజకీయ వ్యవస్థ చేతిలో అణ్వాయుధాలు ఎంత ప్రమాదమో, అ లాంటి ఆయుధాలను నిర్వీ ర్యం చేయవలసిన అవ సరం గురించి ప్రపంచానికి నొక్కి వొక్కాణించాలి. ఈ ప్రక్రియలో మన పార్లమెంటు బృందాలు అనుకున్న ఫలితాలు సాధిస్తాయని ఆశిద్దాం.
వ్యాసకర్త : గుమ్మడిదల రంగారావు,
లోక్‌సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -