Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్వీస్‌ ఉపాధ్యాయులకు'టెట్‌' మినహాయింపునివ్వాలి

సర్వీస్‌ ఉపాధ్యాయులకు’టెట్‌’ మినహాయింపునివ్వాలి

- Advertisement -

ఆర్‌యూపీపీటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు నివ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ (ఆర్‌ యుపీపీటీ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లా అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ టెట్‌ తప్పనిసరైతే భాషోపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్‌ 3 నిర్వహించాలని కోరారు. జి.ఓ 317 ద్వారా నష్టపోయిన భాషోపాధ్యాయులకు అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్రగీత రచయిత ప్రముఖ కవి అందెశ్రీకి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, ఉపాధ్యక్షులు ఎస్‌.లక్ష్మీనారాయణ, కోశాధికారి ఎన్‌. భిక్షపతి, సలహాదారు లక్ష్మణ్‌ గౌడ్‌, రాష్ట్ర బాధ్యులు పద్మజారాణి ,ఎస్‌.అరుణోదయ, షాబీర్‌, జహంగీర్‌, నసీరుద్దీన్‌, విష్ణుమూర్తి, జాన్‌ షాహెదా వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -