- Advertisement -
- పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నవతెలంగాణ-కంఠేశ్వర్: చందాల కోసం విద్యాసంస్థలపై ఒత్తిడి చేసి పాఠశాలల నిర్వహణలో ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం ప్రకటనలో హెచ్చరించారు.ఈ మధ్యకాలంలో కొందరు విద్యాసంస్థలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చందాల కోసం విద్యాసంస్థ లపై దాడులు చేసినా, అలాంటి వారిని ప్రోత్సహించినా వారి సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ల 87126-59777, 08462-226090 లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య హెచ్చరించారు.
- Advertisement -