- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో తిరుపతిరెడ్డి తో కలిసి ప్రత్యేక అధికారి భాస్కర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి భాస్కర్ మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాంతి కుమార్, మండల కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ గణేష్, గ్రామ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు నామాల రవి, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -