రీజినల్ మేనేజర్ జోష్ణ కి ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట చెవులో పువ్వులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారంభారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తగ్గించాలని చెవుల్లో పూలతో నిరసన వ్యక్తం చేసి రీజినల్ మేనేజర్ జోష్ణ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాస్ చార్జీలను అమాంతం 20 శాతానికి పెంచడన్నీ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అదే విధంగా విద్యార్థుల జనరల్ పాస్ నీ 150 నుండి 600 కు పెంచడం దారుణమని వెంటనే పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహాలక్ష్మి స్కీం వలన బస్సు పాసులు చేసుకున్న విద్యార్థుల విద్యార్థులకు కనీసం సీట్లు దొరకని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు పాసులు కలిగిన విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మరియు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు టీచర్లకు అధిక రద్దీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరియు అధికార అద్దె ఉన్న ప్రాంతాలలో బస్సుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచాలని విన్నవించారు. దాంతోపాటు గిరిరాజు కళాశాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్.ఎం జోష్ణ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర అధ్యక్షులు ఆజాద్, జిల్లా నాయకులు రాజు, అభి తదితరులు పాల్గొన్నారు.
పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES