- Advertisement -
ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
2వ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని 4వ వార్డు సభ్యుడు అభ్యర్థిగా ఇందారపు సారయ్య ఈనెల5న తాడిచెర్ల క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. అయితే అతనిపై పోటీకి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు 9న విత్డ్రా చేసుకున్నారు. దీంతో సారయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని పంచాయతీ కార్యాలయంలో అందజేశారు.
- Advertisement -



