- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
79 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో శుక్రవారం పలు క్లబ్ ల ఆద్వర్యంలో జెండా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్,లైన్స్ క్లబ్,ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు సత్యవరపు బాలగంగాధర్,అక్కినేని నరేంద్ర,తిరుమలశెట్టి అప్పారావు లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
వ్యవసాయ కళాశాల,రెవిన్యూ కార్యాలయం,మండల పరిషత్ కార్యాలయం,మున్సిపాల్టీ,పోలీస్ స్టేషన్ లలో ఏడీ హేమంత కుమార్,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,కమీషనర్ నాగరాజు,సీఐ నాగరాజు రెడ్డి,ఎస్ హెచ్ ఓ ఎస్ఐ యయాతి రాజు లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు.
- Advertisement -