- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు కూడా కీలకమైన టీ20 పోరుకు సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా ఆదివారం తొలి సమరం జరగనుంది. వన్డే వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడి క్లీన్స్వీప్ చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ఆస్ట్రేలియాతో ప్రత్యర్థి గడ్డపై తలపడనుంది. హర్మన్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, షఫాలీ, జెమీమా, రిచా బ్యాటింగ్లో రెచ్చిపోతే భారత్ పైచేయి సాధించే అవకాశముంది.
- Advertisement -



