Sunday, June 15, 2025
E-PAPER
Homeఆటలువైజాగ్‌లో భారత్‌, కివీస్‌ టీ20

వైజాగ్‌లో భారత్‌, కివీస్‌ టీ20

- Advertisement -

– షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ
ముంబయి:
టీమ్‌ ఇండియా విశాఖ తీరంలో వరుసగా మ్యాచులు ఆడనుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 6న దక్షిణాఫ్రికా, భారత్‌ మూడో వన్డేకు వైజాగ్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. తాజాగా మరో మ్యాచ్‌ను సైతం విశాఖపట్నానికి కేటాయించారు. కొత్త ఏడాదిలో న్యూజిలాండ్‌.. భారత్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుండగా.. 2026 జనవరి 28న భారత్‌, న్యూజిలాండ్‌ నాల్గో టీ20 మ్యాచ్‌కు వైజాగ్‌ వేదికగా నిలువనుంది. బరోడా, రాజ్‌కోట్‌, ఇండోర్‌లో వన్డేలు.. నాగ్‌పూర్‌, రారుపూర్‌, గువహటి, వైజాగ్‌, తిరువనంతపురంలో టీ20లు షెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -