Friday, June 6, 2025
E-PAPER
Homeఆటలుసెప్టెంబర్‌ 5న థాయ్ లాండ్‌తో భారత్ ఢీ

సెప్టెంబర్‌ 5న థాయ్ లాండ్‌తో భారత్ ఢీ

- Advertisement -

చైనా వేదికగా మహిళల హాకీ ఆసియా కప్‌
ట్రోఫీ విజేత ప్రపంచకప్‌ బెర్తు

హాంగ్జౌ: ఆసియా కప్‌ మహిళల హాకీ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా సెప్టెంబర్‌ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి. గ్రూప్‌-బిలో ఉన్న భారత మహిళల హాకీ జట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను థారులాండ్‌తో తలపడనున్నట్లు హాకీ ఇండియా(హెచ్‌ఐ) బుధవారం వెల్లడించింది. గత ఎడిషన్‌లో కాంస్యం సాధించిన టీమిండియా ఈసారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. ఈ టోర్నీ విజేత 2026 మహిళల ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌ నేరుగా అర్హత సాధించనుంది. ఈ టోర్నీలో ఆడే 8జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. పూల్‌-ఏలో చైనా, కొరియా, మలేషియా, చైనీస్‌ తైపీ ఉండగా.. పూల్‌-బిలో భారత్‌, జపాన్‌, సింగపూర్‌, థారులాండ్‌ జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో భారత జట్టు థారులాండ్‌తో సెప్టెంబర్‌ 5న తలపడనుండగా.. 6న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌, 8న సింగపూర్‌ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీకి భారతజట్టు కెప్టెన్‌గా సలీమా టెటే ఎంపికైన విషయం తెలిసిందే. 2017లో చివరిసారిగా భారత జట్టు ఆసియా కప్‌ విజేతగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -