బాధిత ప్రయాణికులకు రూ.500 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఇటీవలి విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. సంక్షోభంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు పరిహారం అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టప రిహారం మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణి కులకు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకు పోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్టు కంపెనీ పేర్కొన్నది. నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే తమ లక్ష్యమని వివరించింది.
డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నది. జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. కాగా, ఇండిగో ఇప్పటికే వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేలు విలువైన అదనపు ట్రావెల్ వోచర్లను జారీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వోచర్లు డిసెంబర్ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ ట్రావెల్ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగోలో చేసే ఏ ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చని వివరించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.



