నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం ఇందిర ఆవాస్ ప్లస్ 2024 సర్వే నిర్వహించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల్లో హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి 10 శాతం చొప్పున ఇందిర ఆవాస్ ప్లస్ 2024 చెక్కర్ సర్వే పూర్తి చేయగా తన వంతుగా ఐదు శాతం సర్వేను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు నిధులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆర్థిక పరిస్థితి, ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల కారా అనే విషయాలను ఆన్ లైన్ యాప్ లో సర్వే వివరాలను సర్వే వివరాలను పొందుపరచడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్ లో ఇందిర ఆవాజ్ ప్లస్ సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



